“చేసే పనిలో శ్రేష్టత, నిబద్ధత, క్రమశిక్షణ ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది” అనే మాటకు చిరునామాగా నిలుస్తారు ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్. పలు జాతీయ, ప్రాంతీయ పురస్కారాలను అందుకున్న శ్రీకర్ ప్రసాద్… తెలుగు చిత్రం ‘సింహస్వప్నం’(1989)తో తొలి అడుగులు వేశారు. ఆపై పలు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, ఆంగ్ల చిత్రాలకు పనిచేశారు. అనేక బ్లాక్బస్టర్ మూవీస్లో భాగమైన శ్రీకర్ ప్రసాద్… ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ మూవీస్తో బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… వీటిలో సింహభాగం రూ.వందల కోట్లతో రూపొందుతున్న సినిమాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేడు (ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సాహో’ (ప్రభాస్ )తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’(చిరంజీవి), ‘దర్బార్’(రజినీకాంత్), ‘ఆర్ ఆర్ ఆర్’(యన్టీఆర్, రామ్ చరణ్-రాజమౌళి), ‘ఇండియన్ 2’(కమల్ హాసన్-శంకర్), ‘పొన్నియిన్ సెల్వన్’(మణిరత్నం)… ఇలా రూ.వందల కోట్లతో రూపొందుతున్న చిత్రాలన్నీ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్తోనే రాబోతున్నాయి.
ఇప్పటికే తన ప్రతిభతో పలుమార్లు రివార్డులు, అవార్డులు అందుకున్న ఈ ఏస్ ఎడిటర్…ఈ అప్ కమింగ్ ఫిల్మ్స్తోనూ భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: