యూవీ క్రియేషన్స్ వారి భాగస్వామ్యంతో ప్రభాస్ ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ లతో కలిసి ప్రభాస్ ‘వీ’ సెల్యూలాయిడ్ మల్టీ సినీ కాంప్లెక్స్ను నిర్మించారు. అత్యాధునిక సాంకేతికతో ఇండియాలోనే పెద్ద స్క్రీన్ కలిగివున్న థియేటర్ గా ఇప్పటికే దీని పేరు అప్పుడే టాక్ అఫ్ ద టౌన్ అయింది. ఇక ముందుగా చెప్పినట్టే ఈ థియేటర్ ను ఈ రోజు ప్రారంభించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ థియేటర్ ను ప్రారంభించారు. సాహో పాటలు, టీజర్, ట్రైలర్ ను ముందుగా ప్రదర్శించారు. ఇక కార్యక్రమానికి డైరెక్టర్ సుజీత్, జిబ్రాన్, వెటరన్ క్రిటిక్ శ్రీధర్ పిళ్ళై హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మల్టీప్లెక్స్లో మొత్తం మూడు స్క్రీన్లున్నాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2 లు 140 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించగా. స్క్రీన్ 3 మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.దీని సిట్టింగ్ కెపాసిటీ 645. ఈ స్క్రీన్ సైజు 100 అడుగుల ఎత్తు, 54 అడుగుల వెడల్పు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: