గత ఏడాది `తొలిప్రేమ`తో మెమరబుల్ హిట్ అందుకున్న రాశి ఖన్నా… ఆ తరువాత `శ్రీనివాస కళ్యాణం`లో సందడి చేసింది. అయితే… ఆ సినిమా విడుదలై ఏడాది పూర్తయినా… ఇప్పటివరకు మరో తెలుగు చిత్రంలో కనిపించనే లేదు రాశి. అలాగని… రాశి ఖాళీగా ఏమీ లేదు. `శ్రీనివాస కళ్యాణం` తరువాత తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే… తెలుగులోనూ మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కమిటయ్యింది. తమిళ సినిమాలు వరుసపెట్టి విడుదల కాగా… ఇప్పుడు చేతిలో ఉన్న మూడు తెలుగు చిత్రాలు తక్కువ గ్యాప్లోనే తెరపైకి రాబోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగచైతన్యకి జోడీగా నటించిన `వెంకీమామ` అక్టోబర్లో విడుదల కానుండగా… సాయితేజ్కి జంటగా నటిస్తున్న `ప్రతి రోజూ పండగే` డిసెంబర్ 20న రాబోతోంది. ఇక విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న క్రాంతి మాధవ్ చిత్రం కూడా నవంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ కానుందని టాక్. మరి… తక్కువ గ్యాప్లోనే రానున్న ఈ మూడు చిత్రాలతో రాశి ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: