తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. గతంలో ఈ సినిమా టైటిల్ మిస్ ఇండియా అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టే మిస్ ఇండియా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
కాగా ఈస్ట్కోస్ట్ బ్యానర్పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కమారాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. దసరాకి ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా దీనితో పాటు కీర్తి పలు ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది. ఇటీవలే ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళ్ లో మరో థ్రిల్లర్ సినిమాకు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో కార్తికేయ సంతానం నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. దీనితో పాటు కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. అంతేకాదు బాలీవుడ్ లో.. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో కూడా నటించనుంది కీర్తి సురేష్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: