‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శృతి శర్మ. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో… అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే… ఇప్పుడు మరో థ్రిల్లర్ సబ్జెక్ట్లో శృతి నాయికగా ఎంపికైనట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… యువ కథానాయకుడు నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో ‘కార్తికేయ 2’ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మిస్టరీ థ్రిల్లర్లో కథానాయిక పాత్ర కోసం శృతి శర్మను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… అక్టోబర్ రెండో వారం నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా… త్వరలోనే శృతి శర్మ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: