`ఆర్య`, `ఆర్య 2` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బన్నీకి జోడీగా రష్మిక మందన నటించనుంది. కాగా… ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నుంచి మొదలవుతుందని టాక్. త్వరలోనే బన్నీ-సుక్కు మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
ఇదిలా ఉంటే… ప్రస్తుతం బన్నీ ‘అల… వైకుంఠపురములో…’ చిత్రంలో నటిస్తున్నాడు. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.