కథానాయకులను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరే వేరు. తొలి చిత్రం `బద్రి` నుంచి తాజా చిత్రం `ఇస్మార్ట్ శంకర్` వరకు ఇదే శైలిని కొనసాగించాడు పూరి. ఇదిలా ఉంటే… తన నెక్ట్స్ ప్రాజెక్ట్ని యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో చేయనున్న పూరి… ఆ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్నాడని టాక్. `పైసా వసూల్` సమయంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే… దాదాపు రెండేళ్ళ తరువాత అది కార్యరూపం దాల్చనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాని బాలయ్య సొంత బ్యానర్ అయిన యన్.బి.కె పిక్చర్స్తో పాటు పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించనుందని సమాచారం. కె.యస్.రవికుమార్ చిత్రం తరువాత బాలయ్య నటించే సినిమా ఇదే అవుతుందని వినిపిస్తోంది. త్వరలోనే బాలయ్య, పూరి కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: