కియారా అద్వానీ… గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. హిందీ చిత్రం ‘ఫగ్లీ’(2014)తో కథానాయికగా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఆ తర్వాత ‘ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’(2016)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి… తొలి తెలుగు చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. అలాగే… ఇటీవల విడుదలైన ‘కబీర్ సింగ్’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్) రూపంలో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… కియారాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అదేమిటంటే… జూన్ నెలతో కియారాకి ఉన్న కనెక్షన్. ఆ వివరాల్లోకి వెళితే… కియారా ఎంట్రీ ఫిలిం ‘ఫగ్లీ’ 2014 జూన్ 13న విడుదల కాగా… హిందీనాట క్రేజ్ తెచ్చిన `లస్ట్ స్టోరీస్` 2018 జూన్ 15న రిలీజైంది. ఇక బాలీవుడ్ లో కియారా కెరీర్ని మలుపు తిప్పిన ‘కబీర్ సింగ్’ కూడా అదే జూన్ నెలలో అంటే 2019 జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా మూడు సార్లు జూన్ మాసం కియారా బాలీవుడ్ కెరీర్లో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు… ప్రస్తుతం కియారా చేతిలో ‘గుడ్ న్యూస్’, ‘లక్ష్మీబాంబ్’, ‘షేర్షా’, ‘ఇందూ కి జవాని’ చిత్రాలు ఉండగా… వీటిలో `లక్ష్మీ బాంబ్` (`కాంచన` రీమేక్) జూన్ నెలనే టార్గెట్ చేసుకుంది. 2020 జూన్ 5న `లక్ష్మీ బాంబ్` రిలీజ్ కానుంది.
మరి… మున్ముందు కూడా కియారా కెరీర్లో జూన్ మంత్ సెంటిమెంట్ కొనసాగుతుందేమో చూద్దాం.
[subscribe]
[youtube_video videoid=QbSTTK4guo8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: