రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీ గా వుంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఈ సినిమాకి నేను నిర్మాతను అయినప్పటికీ ఇంకా కొన్ని రోజులు షూటింగు జరిగితే బాగుండును కదా అనుకున్నాను. అంత సరదాగా షూటింగ్ జరిగిపోయిందన్నారు. అంతే కాదు మొన్న వేసవికి మా పెద్దబ్బాయి ‘మజిలీ’తో హిట్ కొట్టాడు. మా కోడలు సమంత ‘ఓ బేబీ’ సినిమాతో సక్సెస్ ను సాధించింది. ఈ నెల 9వ తేదీన ‘మన్మథుడు 2’తో నేను వస్తున్నాను. ఆ రెండు సినిమాలకి మించిన హిట్ ను నేను కొడతాను. అలా నా కొడుక్కి .. కోడలికి షాక్ ఇవ్వబోతున్నాను” అంటూ నవ్వుకుంటూ చెప్పారు. మరి నాగ్ అన్నట్టు ఈ సినిమా కనుక హిట్ ఐతే అక్కినేని ఫ్యామిలీ కి ఈ ఏడాది మంచి జక్ పాట్ కొట్టినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
కాగా ఈ సినిమాలో ఇంకా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున, పి.కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్.
[youtube_video videoid=TLWmy4u_qYY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: