ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు.. మొత్తానికి అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి.. ఇటు డైరెక్టర్ రమేష్ వర్మ ఇద్దరికీ హిట్ దక్కింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక రమేష్ వర్మకు కూడా రవితేజతో చేసిన వీర, నాగశౌర్యతో చేసిన అమ్మాయితో అబ్బాయి చిత్రాలు ఫ్లాప్స్ అయ్యాయి. దీనితో ఇద్దరికి రాక్షసుడు చిత్రంతో హిట్ దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రమేష్ వర్మ తన తరువాత సినిమాకు నితిన్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమేష్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఇది అర్ధమవుతుంది. నాకు రీమేక్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ సక్సెస్ కోసం ఈ రాక్షసుడు చేశా. నేను సొంతంగా రాసుకున్న అనేక కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల హీరో నితిన్ కు ఓ కథ వినిపించా. ఆ కథ నితిన్ తో పాటు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డికి కూడా చాలా బాగా నచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. త్వరలో నితిన్ తో తప్పకుండా సినిమా చేస్తానని రమేష్ వర్మ అన్నారు. మరి రాక్షసుడు తో సక్సెస్ రావడం తో ఇప్పుడు నితిన్ ఒప్పుకుంటాడేమో చూద్దాం.
[youtube_video videoid=Q_l02otJ4DY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: