స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో… టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ కాకినాడలోని పోర్ట్ ఏరియాలో జరుగుతోందని సమాచారం. ఆగస్టు 10 వరకు జరిగే ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలిసింది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా… ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: