యువ కథానాయకుడు నాగశౌర్య ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మూడు ఆసక్తికరమైన కథలతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ని ముగ్గురు ప్రముఖ దర్శకులు రూపొందిస్తున్నారు. వారిలో ఒకరిగా సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ కన్ఫర్మ్ కాగా… మరొకరిగా `వాంటెడ్`, `జవాన్` చిత్రాల దర్శకుడు బీవీఎస్ రవి ఎంపికయ్యారని టాక్. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని మూడు కథల్లోనూ నాగశౌర్య కథానాయకుడు కాగా… ఒక్కో కథలో ఒక్కో కథానాయిక ఉంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అంతేకాదు… ఈ మూడు కథల్లో శౌర్యతో పాటు ప్రముఖ కథానాయిక అనుష్క కూడా ముఖ్య భూమిక పోషిస్తోందని సమాచారం. త్వరలోనే అనుష్క ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా… కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన `ఓం నమో వేంకటేశాయ`లోనూ… క్రిష్ డైరెక్ట్ చేసిన `వేదం`లోనూ అనుష్క నటించిన సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: