పివిపి సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో సక్సెస్ ఫుల్ యాక్టర్ , రైటర్ అడివి శేష్ ; రెజీనా జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. బొమ్మరిల్లు, అతిథి , కిక్, Mr పర్ ఫెక్ట్, ఎవడు, క్షణం, ఊపిరి, గూఢచారి వంటి సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ రైటర్ గా పనిచేసిన అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎవరు మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎవరు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. పోలీస్ ఆఫీసర్ గా కేస్ ను ఇన్వెస్టిగేటింగ్ చేసే తీరు, అడివి శేష్ లుక్స్ ఇంప్రెసివ్ గా ఉండి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ హీరో నాని ఆవిష్కరించారు. ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉందని, ఆసక్తిని కలిగించిందని నాని ప్రశంసించారు. సూపర్ హిట్ మూవీ గూఢచారి తరువాత అడివి శేష్ నటించిన ఎవరు మూవీ పై అంచనాలు భారీ గా ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: