ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు. అయితే అప్పుడప్పుడు హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టుకునేవాళ్ళు. తమ సినిమాలు తాము నిర్మించుకునేవాళ్ళు. కానీ ఆ సంప్రదాయం తక్కువగానే ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఇప్పుడున్న యంగ్ హీరోలు మాత్రం ఒకటి రెండు సినిమాలకే సొంత ప్రొడక్షన్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది హీరో లు తమ సినిమాలు తామే నిర్మించుకుంటున్నారు. సినిమా హిట్ అయిందంటే హీరోలకి కాసుల వర్షమే. మరి అలా మన యంగ్ హీరోలు ఎవరు తమ ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే మహేష్ బాబు ఎంబీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ని స్థాపించాడు. కల్యాణ రామ్ ఐతే ఎప్పటినుండో తన సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. వీరి బాటలోనే ఇప్పుడున్న యంగ్ హీరోలు నడుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిన విజయ్ దేవరకొండ ద కింగ్ ఆఫ్ హిల్స్ పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసాడు. తరుణ్ భాస్కర్ హీరో తెరకెక్కబోతున్న ఈ సినిమాను విజయ నిర్మిస్తున్నాడు.
ఇక సందీప్ కిషన్ నిను వీడని నీడను నేనే సినిమా ను తన ప్రొడక్షన్ లోనే తెరకెక్కించాడు. సుధీర్ సమ్మోహనం సినిమాను తన బ్యానర్ లోనే నిర్మించాడు. నితిన్ తాను నిర్మాతగా తమ ప్రొడక్షన్ లో అఖిల్ సినిమాను నిర్మించాడు. నాని కూడా ‘ఆ’ సినిమాతో నిర్మాతగా మారిపోయాడు. ఫలక్ నుమా దాస్ సినిమా హీరో విశ్వక్ సేన్ హీరోగా మరో కొత్త సినిమాను నిర్మించనున్నాడు. ఇక ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న నాగసౌర్య, కార్తికేయ తమ అప్ కమింగ్ సినిమాలు వాళ్లే తమ బ్యానర్లలో చేసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను కూడా పూరీ ఛార్మి కలిసి తమ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాదు అక్కినేని వారసుడు నాగ చైతన్య సతీమణి సమంత తో కలిసి సొంత బ్యానర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మన హీరోలు వేరే వాళ్ళ ప్రొడక్షన్ లో చేయడం ఎందుకు కష్టమో, నష్టమో తామే సినిమా నిర్మించుకుంటే ఏ గోల ఉండదని అనుకుంటున్నట్టున్నారు. అందుకే తమ కుంపటిని తామే నమ్ముకుంటున్నారు.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: