జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో మిషన్ మంగళ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు పలు ప్రెస్ మీట్లలో పాల్గొని సందడి చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక హీరో రెమ్యునరేషన్.. ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా తీసిన బడ్జెట్ తో సమానమని.. ఒక హీరోకి సినిమాకు పెట్టే బడ్జెట్ కు.. తమ సినిమాలకు పెట్టే బడ్జెట్ లో చాలా తేడా ఉంటుందని తెలిపింది. ఆ పద్దతి మారాలని.. ప్రేక్షకులను థియేటర్ కు తీసుకువచ్చే సత్తాను.. సినిమాను బట్టి హీరో హీరోయిన్ల రెమ్మునరేషన్ ఇవ్వాలని సూచించారు. తక్కువ బడ్జెట్ లోనే మంచి సినిమాలు తీయాలి.. వాటి సంఖ్య పెంచాలి.. ప్రస్తుతం తాను నటించిన చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. మరి తాప్సీ చెప్పినట్టు జరగాలంటే కష్టమైన పనే.. చూద్దాం అలాంటి రోజులు వస్తాయేమో..!
కాగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మార్స్ గ్రహం పైకి ప్రయోగించిన మంగళ్ యాన్ ఉపగ్రహం సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ సైంటిస్ట్ రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నారు.
[youtube_video videoid=q10nfS9V090]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: