సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘పోకిరి’,’బిజినెస్ మెన్’ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్య జనగణమన సినిమా వస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. కానీ తర్వాత రకకరకాల కారణాలతో ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మరి ఈ సక్సెస్ వచ్చినందుకు మాట్లాడాడో.. ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య మహేష్ నేను హిట్స్ తీస్తేనే మహేష్ సినిమా చేస్తాడు అన్న కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో మహేష్, పూరీ సినిమా కష్టమే అన్న సందేహం వచ్చేసింది. అయితే ఇప్పుడు పూరీ జనగణమన సినిమాను తీయడానికి మాత్రం ఫిక్స్ అయ్యారు.
అయితే తాజా సమాచారం ప్రకారం పూరీ జనగణమన సినిమాలో కే.జీ.ఎఫ్ హీరో యష్ ను హీరోగా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరి. అసలు మహేష్ ఫ్యాన్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
[youtube_video videoid=AvdgMGQt1yc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: