బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఈసినిమా నుండి పాటలను, పోస్టర్లను రిలీజ్ చేస్తూ అభిమానులను కూల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా, అందులోనూ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం చాలా భారీగా చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ప్రభాస్ సాహో ప్రమోషన్ కోసం నేషనల్ వైడ్ గా టూర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందు ఇక్కడ ఏపీ తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత.. బెంగుళూరు మరియు చెన్నైలో జరిగే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడట. హిందీలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, కలకత్తా మరియు పూణే వెళ్లనున్నాడట. మొత్తానికి ఈ నెలరోజుల్లో డార్లింగ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చాలా బిజీగా ఉంటాడన్నమాట.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: