సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఫిదా’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సాయిపల్లవి. ఈ చిత్రంలో భానుమతిగా ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి… ఆ తరువాత ‘ఎం.సి.ఎ’, ‘కణం’, ‘పడిపడి లేచె మనసు’ వంటి చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో నటించి మెప్పించింది. కేవలం నటనతోనే కాదు, నర్తనతోనూ ఆడియన్స్ని అలరిస్తున్న ఈ భామ ప్రస్తుతం… ‘విరాటపర్వం’లో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు… నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లోనూ కథానాయికగా దర్శనమివ్వనుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. సెప్టెంబర్లో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని… క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయాపజయాల సంగతి పక్కన పెడితే… క్రిస్మస్తో, సాయిపల్లవికి మంచి అనుబంధమే ఉంది. అదేమిటంటే… 2017లో క్రిస్మస్ సీజన్లో ‘ఎం.సి.ఎ’తో పలకరించిన ఈ డ్యాన్సింగ్ సెన్సేషన్… సరిగ్గా ఏడాదికి అంటే… 2018లో అదే క్రిస్మస్కి ‘పడిపడి లేచె మనసు’తోనూ, తమిళ అనువాద చిత్రం ‘మారి 2’తోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కట్ చేస్తే… ఇప్పుడు మరోసారి 2019 క్రిస్మస్కు, తనకి ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ను అందించిన డైరెక్టర్తో కలసి సందడి చేయడానికి సిద్ధపడుతోంది. మరి… ఈ క్రిస్మస్ రిలీజ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.
[youtube_video videoid=GyLOW3hf-KU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: