ఫీల్గుడ్ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, `అనామిక`… ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథా ఇతివృత్తాలని తెరకెక్కించి సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కమ్ముల…. `అనామిక` అనంతరం మూడేళ్ళ గ్యాప్ తీసుకుని రూపొందించిన చిత్రం ‘ఫిదా’. మలయాళ చిత్రం `ప్రేమమ్`తో దక్షిణాది వారి దృష్టిని ఆకర్షించిన `మలర్` సాయిపల్లవి ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ పోరి భానుమతిగా తన నటనతో, నర్తనంతో కుర్రకారుని `ఫిదా` చేసింది. అంతేకాదు… తొలి తెలుగు సినిమాతోనే స్టార్డమ్ చూడడమే కాకుండా… `ఉత్తమ నటి`గా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమాతోనే కథానాయకుడు వరుణ్ తేజ్ తొలి ఘనవిజయాన్ని చవిచూశాడు. సాయిచంద్, శరణ్య ప్రదీప్, రాజా చెంబోలు, గీతా భాస్కర్, ‘సత్యం’ రాజేష్, హర్షవర్ధన్ రాణే, గాయత్రి గుప్తా తదితరులు ఇందులో ఇతర ముఖ్య భూమికలను పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, వనమాలి, సుద్దాల అశోక్తేజ, చైతన్య పింగళి గీత రచన చేసిన ఈ సినిమాలోని పాటలకు… శక్తికాంత్ కార్తీక్ బాణీలు సమకూర్చాడు. ‘మల్లీశ్వరి’ (1951) చిత్రంలోని “పరుగులు తీయాలి” అనే పాట స్పూర్తితో రూపొందిన ‘హే పిల్లగాడా’… అలాగే ‘వచ్చిండే’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా సాయిపల్లవి నృత్యాలతో వర్ణరంజింతంగా సాగిన ‘వచ్చిండే’ పాటైతే యూట్యూబ్లో (212 మిలియన్ వ్యూస్) అత్యధిక వ్యూస్ పొందిన తెలుగు చిత్ర గీతంగా రికార్డులకెక్కింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఫిదా’ 2017 జూలై 21న విడుదలై… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నేటితో ఈ సినిమా రెండేళ్ళు పూర్తి చేసుకుంటోంది.
[youtube_video videoid=OCes_1n-Bl4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: