ఆగస్ట్ నెల లో టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంది. సినీ అభిమానులను అలరించడానికి ఆగస్ట్ నెలలో పలు మూవీస్ రిలీజ్ కు సిద్ధం గా ఉన్నాయి. వినోద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన సోషల్ థ్రిల్లర్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ మూవీ తమిళ రీమేక్ నేర్ కొండ పార్వై ఆగస్ట్ 8వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మన్మథుడు మూవీ సీక్వెల్ కింగ్ నాగార్జున హీరో గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ మన్మథుడు2 9వ తేదీ రిలీజ్ కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం లో యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రణరంగం 15 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజీ దర్శకత్వం లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎవరు ఆగస్ట్ 15 వ తేదీ, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, శివకార్తికేయన్ ప్రధాన పాత్రలలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా కౌసల్య కృష్ణ మూర్తి 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారా ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఇక చాలారోజులుగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 నుంచి 30కి పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘సాహో’ విడుదల వాయిదా గురించి నిర్మాతల నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరి ఇందులో నిజం ఎంత? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: