యువ కథానాయకుడు శర్వానంద్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్గా నిలచిన చిత్రం ‘శతమానం భవతి’. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో శర్వాకి జోడీగా నటించి అలరించింది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్. కట్ చేస్తే… మూడేళ్ళ తరువాత అదే సంక్రాంతికి మరో చిత్రంతో పలకరించనుందట ఈ అందాల జంట.
ఆ వివరాల్లోకి వెళితే… శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి తొలి దర్శకత్వంలో ‘శ్రీకారం’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం… త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళనుంది. కాగా… ఈ చిత్రంలో శర్వాకి జోడీగా అనుపమ ఎంపికైందని టాలీవుడ్ టాక్. త్వరలోనే అనుపమ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరి… 2017 సంక్రాంతికి ‘శతమానం భవతి’తో అలరించిన శర్వా, అనుపమ జోడీ… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్రీకారం’తోనూ ఆకట్టుకుంటుందేమో చూడాలి.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
[youtube_video videoid=oCt5MRjq7lk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
Subscribe to our Youtube Channel
Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.