క్షణం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో హిట్ కొట్టి.. అమీతుమీ లాంటి కామెడీ ఎంటర్ ర్టైనర్ తో ప్రేక్షకులను అలరించి.. మళ్ళీ గూఢచారి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. తాను చేసే ప్రతి సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా చాలా సీక్రెట్ గానే షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ప్రీలుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు పీవీపీ సినిమా తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
#Evaru Pre Look Tomorrow at 10 AM
— PVP Cinema (@PVPCinema) July 8, 2019
Directed by @ramjivv@AdiviSesh @reginacassandra @kk_kamineni @Naveenc212 @murlisharma72 @abburiravi @SricharanPakala @Garrybh88 @Vamsi_P1988 pic.twitter.com/iLTu2gtmCx
కాగా పీవీపీ బ్యానర్ పై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 23న విడుదల చేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: