మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తాజాగా చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే… దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని ట్రేడ్ టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం… కన్నడనాట ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని తెలిసింది.
ఆ వివరాల్లోకి వెళితే… తెలుగుతో పాటు, కన్నడనాట కూడా చిరుకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… కర్ణాటకలో ‘సైరా’ థియేట్రికల్ రైట్స్ ఆశ్చర్యకర రీతిలో దాదాపు రూ.32 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. శాండల్ వుడ్లో చిరుకి ఉన్న క్రేజ్కి తోడు కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నటించడంతో… ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ యజమాని దేవదాస్ ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. కన్నడ నాట బాహుబలేతర సినిమాలకు సంబంధించి ఈ రేంజ్లో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పుకుంటున్నారు.
కాగా… సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామా… గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.