నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుల్లో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడమే కాదు… ఆల్ టైమ్ క్లాసిక్స్గానూ నిలిచాయి. అటువంటి ఈ క్లాసిక్ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం చెన్నైలో ఉన్న బాలయ్య… రీసెంట్గా సింగీతం శ్రీనివాసరావును ఆయన ఇంటికి వెళ్ళి కలవడం జరిగిందట. ఈ సందర్భంగా… ఇద్దరి మధ్య పలు ఆసక్తికరమైన కబుర్లు చోటుచేసుకున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే… `వెల్కమ్ ఒబామా` (2013) తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టని సింగీతంని… తనతో గానీ, లేదంటే తన తనయుడు మోక్షజ్ఞతో గాని ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని చేయమని బాలయ్య అడిగారని వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి కొన్నాళ్ళ క్రితమే బాలయ్య, సింగీతం కాంబోలో `ఆదిత్య 369` సీక్వెల్కి ప్లానింగ్ జరిగినా… అది వర్కవుట్ కాలేదు. మరి… ఈ సారైనా ఈ క్లాసిక్ కాంబో సెట్ అవుతుందో లేదంటే మోక్షజ్ఞ ఎంట్రీ ఫిల్మ్నే తన రీ-ఎంట్రీ ఫిల్మ్గా సింగీతం ఎంచుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.