‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నివేదా పేతురాజ్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పొందిన నివేదా… ఆ తరువాత ‘చిత్రలహరి’లోనూ అలరించింది. అలాగే నివేదా తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’ ఈ రోజు (జూన్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు జంటగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ నటిస్తుండగా… నివేదా సెకండ్ హీరోయిన్గా దర్శనమివ్వనుంది. అంతేకాదు… బన్నీ తదుపరి చిత్రంలోనూ నివేదా నాయికగా ఎంపికైనట్టు టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… బన్నీ, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ‘ఐకాన్’ పేరుతో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. బన్నీతో `ఆర్య`, `పరుగు`, `ఎవడు`, `దువ్వాడ జగన్నాథమ్` వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన `దిల్` రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ని నిర్మించనున్నాడు. కాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో… బన్నీ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇద్దరు హీరోయిన్లకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా అలియా భట్ నటించే అవకాశముందని వార్తలు వస్తుండగా… రెండో నాయికగా నివేదా సెలెక్ట్ అయినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా… వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ‘ఐకాన్’… 2020 దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=yzeAxZY7p9A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: