ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బుర్రకథ’. మిస్టీ చక్రవర్తి, నైరాషా కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. రెండు మెదళ్ళు ఉన్న ఓ యువకుడి చుట్టూ తిరిగే కథాంశంతో `బుర్రకథ` తెరకెక్కింది. అభిమన్యు సింగ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
కాగా… దీపాల ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్ దీపాల నిర్మించిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రేపు (జూన్ 28) విడుదల కావలసి ఉంది. అయితే… సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తారు.
మరి… చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి… ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతోనైనా ఆ విజయం వరిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.