‘లై’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘా ఆకాష్. ఆ తరువాత ‘ఛల్ మోహన రంగ’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన మేఘ… ప్రస్తుతం ‘మను చరిత్ర’తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే… ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘పేట్టై’తో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి… ఆ తరువాత ‘వంద రాజవదాన్ వరువేన్` (`అత్తారింటికి దారేది` రీమేక్), ‘బూమ్రాంగ్’ వంటి చిత్రాలతో తమిళ ఆడియన్స్నూ అలరించింది. ఈ నేపథ్యంలో… మేఘ తాజాగా మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్టు కోలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే… తమిళ హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు వెంకట కృష్ణన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో విజయ్కు జంటగా మేఘ నటించనున్నట్టు సమాచారం. ఇటీవల పట్టాలెక్కిన ఈ చిత్రం… ప్రస్తుతం ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి మేఘ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే… మేఘ కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్రాలు ‘ఎనై నోకి పాయుం తోట’, ‘ఒరు పక్క కథై’ విడుదలకు సిద్ధంగా ఉండగా… బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ‘శాటిలైట్ శంకర్’ ఈ ఏడాది సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలు ఆమె కెరీర్కు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.