ఇటీవల ‘118’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యువ కథానాయిక షాలినీ పాండే… తనకు ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చిన స్వప్న సినిమా బ్యానర్లో మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నట్టు టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పొలిశెట్టి (‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ హీరో) హీరోలుగా స్వప్న సినిమా సంస్థ నుంచి ఓ చిత్రం రాబోతోంది. అనుదీప్(‘పిట్టగోడ’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం షాలిని పాండేను కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ కథలో లాయర్గా దర్శనమివ్వనుందట షాలిని. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి మరింత స్పష్టత రానుంది.
కాగా… ప్రస్తుతం షాలిని నటిస్తున్న తమిళ చిత్రాలు ‘100% కాదల్’, ‘గొరిల్లా’ విడుదలకు సిద్ధంగా ఉండగా… ‘అగ్ని సిరగుగల్’(తెలుగులో `జ్వాల`), ‘సైలెన్స్’ (తెలుగులో `నిశ్శబ్దం`) షూటింగ్ దశలో ఉన్నాయి.
[youtube_video videoid=kqLuvH6BCbg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: