సురేష్ ప్రొడక్షన్స్.. టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హోస్ లలో ఇది ఒకటి. మూవీ మొగల్ దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆనాటి తరం నుండి ఈ నాటి తరం వరకూ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి దాదాపు 55 సంవత్సరాలు పూర్తికావస్తున్నాయి.. అయినా కూడా ఎప్పుడూ ఈ బ్యానర్ నుండి సినిమాలు వస్తూనే ఉన్నాయి. సంవత్సరానికి సంవత్సరానికి సినిమాల సంఖ్య పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. ఇప్పుడేతే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా… కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలైనా సరే నూతన దర్శకులకు ప్రోత్సాహానిస్తూ వారి సినిమాలను తమ బ్యానర్ లో రిలీజ్ చేస్తూ సహాయపడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ బ్యానర్ నుండి ఎంతో మంది హీరోలు.. హీరోయిన్స్ కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఎన్నో బ్లాక్ బస్టర్లు బాక్సాఫీస్ కు అందించిన ఈ బ్యానర్ నుండి మెగాస్టార్ చేసిన సినిమాల సంఖ్య మాత్రం చాలా తక్కువ. కేవలం ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా సంఘర్షణ మాత్రమే ఈ బ్యానర్ నుండి వచ్చింది. అయితే దీనికి కారణం ఏంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.
అదేంటంటే… అప్పట్లో స్టార్ హీరోగా చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. కాల్షీట్లు అస్సలు ఖాళీ ఉండేవి కాదు. ఇక నాన్నకీ .. చిరంజీవిగారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈనేపథ్యంలో మా బ్యానర్ లో సినిమా చేయమని అడిగితే.. చిరు బీజీగా ఉండటంవల్ల టైమ్ అడుగుతారేమో అని నాన్నగారు ఆలోచించేవారు.. ఆయనకేమో… గ్యాప్ లేకుండా సినిమాలు తీయాలని ఉండేది.. అందుకే కొత్తవారైనా వారితో సినిమాలు చేసేవారు. అదృష్టవశాత్తు అవికూడా మంచి సక్సెస్ అయ్యేవి. అలా చిరుతో ఎక్కువ సినిమాలు తీయలేకపోయాం అంతేకానీ… వేరే ఇంకేం లేదు అని క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటివరకూ ఈ విషయంలో ఎవరికైనా డౌట్లు ఉంటే ఈ సమాధానంతో తీరిపోతుంది..!
[subscribe]
[youtube_video videoid=ILY3zkBenNU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: