సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందనున్న సరిలేరు నీకెవ్వరు మూవీ మే 31 వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. MB ఎంటర్ టైన్ మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందనున్న సరిలేరు నీకెవ్వరు మూవీ లో రష్మిక మందన్న కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా సంవత్సరాల విరామంతరువాత విజయశాంతి ఈ మూవీ ద్వారా రీఎంట్రీ అవడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ఘనవిజయం సాధించి, టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. మహర్షి మూవీ సక్సెస్ ను మహేష్ బాబు తన ఫ్యామిలీ తో యూరప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ కాశ్మీర్ లో ప్లాన్ చేసింది. ఈ మూవీ లో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించే సీన్స్ ను కాశ్మీర్ లో చిత్రీకరించి, మిగతా పార్ట్ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తారు. సరిలేరు నీకెవ్వరు మూవీ ని 2020 సంవత్సరం సంక్రాంతి కి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.
[youtube_video videoid=Rsdy4L8iV28]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: