కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రలలో దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… ఇప్పటికే సింహభాగం షూటింగ్ను పూర్తి చేసుకున్నట్టు వినికిడి. ప్రస్తుతం హైదరాబాద్లో తాజా షెడ్యూల్ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కీర్తి సురేష్ కూడా జాయిన్ అయిందని చిత్ర దర్శకుడు రాహుల్ ట్వీట్ చేశాడు. అలాగే నాగ్, కీర్తిపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాల తాలూకు ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు రాహుల్.
సీనియర్ నటి లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం… ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: