‘ఎర్రసైన్యం’, ‘చీమల దండు’, ‘ఒరేయ్ రిక్షా’, ఇలా సమాజంలోని తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ఎన్నో సినిమాలు చేసారు ఆర్ నారాయణ మూర్తి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నారాయణమూర్తి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ఆడియో కార్యక్రమానికి గతంలో చిరు వచ్చి ప్రోత్సాహాన్ని అందించారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు సైతం నారాయణ మూర్తిపై ప్రశంసలు కురిపించారు. వి.వి వినాయక్, పూరీ జగన్నాథ్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి కి స్పెషల్ ప్రివ్యూ వేయగా.. సినిమా చూసిన వారు.. సమాజానికి దగ్గర ఉండే ఇలాంటి కథలు తీయడంలో ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడూ ముందుటారని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ చిత్రంలో ఆర్. నారాయణమూర్తి తోపాటు ఎల్.బి. శ్రీరామ్, కాశీ విశ్వనాథ్, గౌతంరాజు, క ష్ణనాయక్, విక్రమ్, నర్సయ్య తదితరులు నటించారు. మాటలు – ఆర్. నారాయణమూర్తి, జలదంకి సుధాకర్, పాటలు – గద్దర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, గవిగంటి రాజలింగం, కెమెరా – శ్రీనివాస్, ఎడిటింగ్ – రామారావు, కథ – కథనం – సంగీతం – నిర్మాత- దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి.
[subscribe]
[youtube_video videoid=8cP2rFLgCoo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: