‘వెంకీమామ’ కాశ్మీర్ నుండి హైదరాబాద్ కు

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ టీమ్ కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. రెండు వారాలపాటు జరిగిన షూటింగ్ లో… ఆర్మీ నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారట. ఇక ఈ షెడ్యూల్ జూన్ 13తో పూర్తి కానుంది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ తరువాత తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఇది మేజర్ షెడ్యూల్ అనీ .. ఏకధాటిగా షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చాలాభాగం చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు.

కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరి మామఅల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ అంచనాలను వెంకీమామ రీచ్ అవుతుందో?లేదో? చూద్దాం…

[subscribe]
[youtube_video videoid=N6vxER5O9Bk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 1 =