విశ్వక్ సేన్ దర్శక నిర్మాతగా తెరకెక్కిన సినిమా ఫలక్ నుమా దాస్. మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్.. కాస్త అభ్యంతర పదాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చకపోయినా.. నైజాంలో మాత్రం ఈ సినిమా దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు విజయ దేవరకొండ ఫ్యాన్స్ కు విశ్వస్ సేస్ మధ్య మాటల యుద్దం కూడా కొనసాగుతుంది. ప్రెస్ మీట్ లు పెట్టి మరీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు వార్నింగ్ లు ఇస్తున్నాడు విశ్వక్ సేన్. ఇది కూడా సినిమా ప్రమోషన్ లాగా బాగానే ఉపయోగపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో నైజాంలో మాత్రం ఫలక్ నుమా దాస్ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ‘ఫలక్ నుమా దాస్’ మొదటి రోజు నైజాంలో ప్రీమియర్ షోలను కూడా కలుపుకుని మొత్తం 75 లక్షల షేర్ ను రాబట్టింది. అదేవిధంగా రెండో రోజున 48 లక్షల షేర్ ను, మూడో రోజున 44 లక్షల షేర్ ను, నాలుగో రోజున 22 లక్షల షేర్ ను సాధించింది. కాగా నైజాంలో మొత్తం నాలుగు రోజులుకుగానూ ‘ఫలక్ నుమా దాస్’ 1.89 కోట్ల షేర్ ను రాబట్టింది. పక్కా హైదరాబాద్ నేపథ్యంలో తీయడంతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు. ఇక ప్రస్తుతం రిలీజ్ కు మరే సినిమాలు కూడా లేకపోవడంతో దాదాపు 3 కోట్ల షేర్ వరకూ ఈ సినిమా వెళ్లే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు సినీ విశ్లేషకులు.
[subscribe]
[youtube_video videoid=JxLXURcTA0k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: