‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి జట్టు కట్టనున్నారు. అయితే ఈ సారి వెండితెరపై కాదు క్రికెట్ మైదానంలో ఈ ఇద్దరు కథానాయకులు సందడి చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం లండన్లో ఐ.సి.సి.క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 14వ తేదీ వరకు సాగే ఈ క్రికెట్ సంగ్రామంలో ఇండియాతో పాటు పలు దేశాలు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ క్రికెట్ అభిమాని నుంచి సెలబ్రిటీల వరకు అందరూ క్రికెట్ ఫీవర్తో ఊగిపోతున్నారు. దానికి మన టాలీవుడ్ హీరోలు కూడా మినహాయింపు కాదు. అందులోనూ… వెంకీ, మహేష్లకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో వేరేగా చెప్పనక్కరలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు క్రికెట్ను వీక్షించేందుకు లండన్ బయలుదేరనున్నారని సమాచారం.
ప్రస్తుతం… యూరోప్లో ఫ్యామిలీతో హాలిడేని ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్… జూన్ 9వ తేదీన జరిగే ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కోసం లండన్ బయలుదేరనున్నాడట. అలాగే… ‘వెంకీమామ’ తాజా షెడ్యూల్తో బిజీగా ఉన్న వెంకీ కూడా… ఆ షెడ్యూల్ను పూర్తి చేసుకుని జూన్ 9వ తేదీన జరిగే క్రికెట్ మ్యాచ్ను మహేష్తో కలసి వీక్షించేందుకు లండన్ పయనమవనున్నాడని టాక్. జూన్ 16వ తేదీన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం… ఈ పెద్దోడు, చిన్నోడు ఇండియాకు చేరుకుని… తమ అప్కమింగ్ మూవీస్పై దృష్టి పెట్టనున్నారని వినికిడి. అంటే… జూన్ 9వ తేదీన జరిగే ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ నుంచి న్యూజిలాండ్ (జూన్ 13న), పాకిస్థాన్(జూన్ 16న) మ్యాచ్ల వరకు వెంకీ, మహేష్ మైదానంలోనే కాదు… బుల్లితెరపై కూడా తమ అభిమానులను అలరించనున్నారన్న మాట.
కాగా… వెంకీ, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ‘వెంకిమామ’ దసరాకు విడుదల కానుండగా… జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=CFsqdfFdXI0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: