ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం చిత్ర పరిశ్రమలో షరా మామూలే. అయితే… రిలీజ్ కూడా కాని ఓ తెలుగు సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సమంత ప్రధాన పాత్రధారిణిగా తెరకెక్కిన ‘ఓ బేబీ’పై టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొరియన్ మూవీకి రీమేక్గా రూపొందిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను మహిళా దర్శకురాలు బి.నందినీ రెడ్డి తెరకెక్కించింది. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో… సీనియర్ నటీమణి లక్ష్మి కీలకపాత్రను పోషించగా… రాజేంద్రప్రసాద్, రావురమేష్ ప్రధాన పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే… ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఓ బేబీ’ని నిర్మించనుందట. సామ్ పాత్రలో ఓ అగ్ర కథానాయిక నటించనుందనీ కూడా సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
[subscribe]
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: