కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందిన హిందీ మూవీ M.S ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ ఘనవిజయం సాధించింది. తరువాత లస్ట్ స్టోరీస్ మూవీ లో నటించిన కియారా కు ఆఫర్స్ వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కియారా జంటగా నటించిన భరత్ అనే నేను మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కియారా హీరోయిన్ గా నటించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్, షేర్ షాన్ , ఇందు కి జవానీ హిందీ మూవీ షూటింగ్స్ లో కియారా బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భరత్ అనే నేను మూవీ తో తన సినీకెరీర్ లో అద్భుతమైన మార్పు వచ్చిందని, భరత్ అనే నేను మూవీ లో తన పెర్ఫార్మెన్స్ నచ్చి సందీప్ వంగ కబీర్ సింగ్ మూవీ లో అవకాశం ఇచ్చారని, భరత్ అనే నేను మూవీ సక్సెస్ కు తెలుగు పేక్షకులకు రుణపడి ఉంటానని, సంవత్సరానికి ఒక్కటైనా తెలుగు మూవీ లో నటించాలనుకుంటున్నట్టు, పాన్ ఇండియా యాక్ట్రెస్ గా మారాలని తన కోరిక అంటూ కియారా చెప్పారు. రామ్ చరణ్ తో కియారా నటించిన రెండవ మూవీ వినయ విధేయ రామ నిరాశ పరిచింది. బాలీవుడ్ లో పలు మూవీస్ కు కమిట్ అయిన కియారా తెలుగు మూవీ కి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: