ఒకప్పుడు ఒక హీరో ఒక ఏడాదికి మూడు నాలుగు సినిమా చేసేవారు. అంతకంటే ఎక్కువ సినిమాలు చేసేవారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఆనాటి హీరోలు తమ సినీ కెరీర్ లో రెండు మూడొందలకు పైగా సినిమాలు తీసేవారు. అయితే అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా తీయడమే చాలా కష్టంగా మారింది. అప్పట్లో సెంచరీ చేయడం అనేది ఒక ల్యాండ్ మార్క్ గా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్ కాస్తా 25 సినిమాలకు తగ్గింది. అంతేకాదు.. అప్పట్లో జయాపజయాలతో పని లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్లేవారు. కానీ ఇప్పుడున్న హీరోలు.. ఒక ఫ్లాప్ వచ్చిందంటే చాలు.. మరో సినిమా చేయడానికి భయపడుతున్నారు. దీనికి ఫ్యాన్స్ తమపై పెట్టుకునే ఎక్స్ పెక్టేషన్స్ కూడా కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో…మంచి కథల కోసం ఎదురుచూడడంతో సంవత్సరానికో లేదా రెండు సంవత్సరాలకో ఒక సినిమానే రంగంలోకి దింపడం వలన 25 సినిమాలు పూర్తయ్యేటప్పటికి దాదాపుగా 20 ఏళ్ళు పడుతుంది. ఇలా 25 సినిమా చేరువలో ఉన్న.. రీసెంట్ గా క్రాస్ చేసిన హీరోలు కొంతమందిని చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్
1996 లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ టైంలోనే ఫుల్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. పవర్ స్టార్ స్థాయికి ఎదిగి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తన 22 ఏళ్ల కెరీర్ లో చేసిన సినిమాల సంఖ్య 25. ‘అజ్ఞాతవాసి’ సినిమాతోనే ఆయన తన ల్యాండ్ మార్క్ ను రీచ్ అయ్యారు.
మహేష్ బాబు
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన మహేష్ బాబు..1999 లో ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తన ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో మహర్షి సినిమాతో 25 సినిమాల ల్యాండ్ మార్క్ ను చేరుకున్నాడు మహేష్.
జూ.ఎన్టీఆర్
అసలు 25 చిత్రాల ల్యాండ్ మార్క్ అనేది మొదటగా ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ద్వారా మొదలైంది. 2001 లో ‘నిన్ను చూడాలని’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన తారక్ .. 2016 లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో 25 చిత్రాలను పూర్తిచేసుకున్నాడు. 15 ఏళ్లలో తను 25 చిత్రాలు పూర్తి చేశాడు.
నాని
మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినా.. 2005లో ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు నాని. ఇక నాని కూడా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి 15 ఏళ్లు అవుతుంది. ఈ 15 ఏళ్లలో ఇప్పటికి 23 సినిమాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ‘జెర్సీ’ సినిమా 23వ సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నాని 24 వ సినిమా. దానితో పాటు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘V’ సినిమా కూడా చేస్తున్నాడు. ఇది నానికి 25వ సినిమా.
శర్వానంద్
విభిన్నమైన పాత్రలు ఎంచుకోవడంలో శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన శర్వా.. రాథా సినిమాతో 25 సినిమాల ల్యాండ్ మార్క్ అందుకున్నాడు. ఆ తరువాత ‘మహానుభావుడు’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు చేశాడు. ప్రస్తుతం ’96’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.
నితిన్
2002 లో ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక తను సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు అవుతుంది. ఈ 16 ఏళ్ల సినీ కెరీర్ లో నితిన్.. ‘చల్ మోహన రంగ’ సినిమాతో 25 చిత్రాల ల్యాండ్ మార్క్ ను దాటాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు.
గోపీచంద్
కెరీర్ మొదట్లో విలన్ గా సినిమాలు చేసిన గోపీచంద్.. 25 సినిమాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 17 ఏళ్ళు పట్టింది. ‘పంతం’ సినిమా గోపీచంద్ 25 వ సినిమా.
వీరితో పాటు మరికొంత మంది యంగ్ హీరోలు ఈ 25 సినిమాల ల్యాండ్ మార్క్ ను దాటటానికి చేరువలో ఉన్నారు. వారిలో అల్లు అర్జున్ పేరు మొదటి గా చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్, రామ్ చరణ్ కూడా దగ్గర్లోనే ఉన్నారు. రామ్ చరణ్ కి అయితే కాస్త ఎక్కువ టైమే పట్టేలా ఉంది. మరి చూద్దాం.. ఈ హీరోలు ఎప్పుడు 25 సినిమాల మైల్ స్టోన్ దాటతారో… వీరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో..
[subscribe]
[youtube_video videoid=B9_AnB9WRZw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: