“భానుమతి… ఒక్కటే పీస్” అంటూ ‘ఫిదా’లో సాయిపల్లవి చెప్పిన డైలాగ్… ఆమె సినీ కెరీర్కు చక్కగా సరిపోతుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ బ్యూటీ… అనతికాలంలోనే దక్షిణాదిన నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’(2015)తో కథానాయికగా పరిచయమైన సాయిపల్లవి… అనంతరం బ్లాక్ బస్టర్ మూవీ ‘ఫిదా’(2017)తో తెలుగుతెరకు పరిచయమైంది. ఇలా రెండు భాషల్లోనూ తొలి చిత్రాలతో ఘనవిజయాలు అందుకోవడమే కాకుండా ఫిల్మ్ఫేర్
అవార్డులను కూడా సొంతం చేసుకుంది పల్లవి. అలాగే… ఈ రెండు సినిమాల్లోనూ తన అమేజింగ్ డాన్సింగ్ స్కిల్స్తో కుర్రకారుని ఫిదా చేసింది. ఆపై ‘ఎం.సి.ఎ’, కణం
, పడిపడి లేచె మనసు
చిత్రాలతో నటిగా మరింత గుర్తింపుని తెచ్చుకుంది సాయిపల్లవి. వీటిలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం
లో నాలుగేళ్ళ పాపకు తల్లిగా నటించి మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి. తాజాగా ఆమె నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎన్జీకే
ఈ నెల 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.
తెలుగు, తమిళ, మలయాళం… ఇలా మూడు భాషల్లోనూ తనదైన నటనతో దూసుకుపోతున్న ఈ డాన్సింగ్ సెన్సేషన్… మున్ముందు మరిన్ని విజయాలు అందుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
[youtube_video videoid=GyLOW3hf-KU ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: