దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. గత ఏడాది భారీ తారాగణంతో ‘నవాబ్’ (తమిళంలో ‘చెక్క చివంత వానం’) సినిమాను తెరకెక్కించిన ఈ లెజెండరీ డైరెక్టర్… ఇప్పుడు మరోసారి అదే బాటలో తన అప్కమింగ్ మూవీని కూడా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవలాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు మణి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు మోహన్ బాబు, విక్రమ్, కార్తీ, ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన మద్రాస్ టాకీస్తో పాటు లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించడానికి ముందుగా ప్లాన్ చేసాడు మణిరత్నం. అయితే బడ్జెట్ రీత్యా ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్కి బదులు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించాలని మణిరత్నం ఆలోచిస్తున్నాడట. ఈ నేపథ్యంలో రిలయన్స్ ప్రతినిథులతో చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. అంతా ఓకే అయితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని కోలీవుడ్ టాక్. మరి ఈ సినిమాకి సంబంధించి త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=xq40_JFj-sA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: