సంగీతం.. సాహిత్యం.. నృత్యం అనే మూడు అంశాలను కీలకం చేసుకొని సినిమాలు తీసి వహ్ వా అనిపించుకున్న సంగీత దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. అలాంటి లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో కె. విశ్వనాథ్ గారి బయోపిక్ ను తెరకెక్కిస్తుండగా… మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా.. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవల ‘సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019’లో డాక్యుమెంటరీ విభాగంలో (పనోరమ సెక్షన్) ‘విశ్వదర్శనం’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. ‘దాదాసాహెబ్ పాల్కే’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక కథ విభాగంలో ఈ చిత్రానికి పురస్కారం లభించింది. ఢిల్లీలో జనార్థన మహర్షి ఈ అవార్డును అందుకున్నారు. మరి రిలీజ్ అయిన తరువాత ఈ సినిమాకు అవార్డులు దక్కుతాయో లేదో తెలియదు కానీ.. రిలీజ్ కాకముందే అరుదైన అవార్డ్ ను సొంతం చేసుకుంది.
[subscribe]
[youtube_video videoid=8aGq36Cf1qg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: