యువ కథానాయకుడు రాజ్ తరుణ్ ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే
చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్
రాజు నిర్మిస్తున్న ఈ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం అర్జున్ రెడ్డి
ఫేమ్ షాలిని పాండేకి దక్కిందని టాలీవుడ్ టాక్. నటనకు అవకాశమున్న పాత్ర కావడంతో యూనిట్… షాలిని వైపు మొగ్గు చూపిందని తెలుస్తోంది. వాస్తవానికి… షాలిని కంటే ముందు ఈ పాత్ర కోసం అవికా గోర్, హెబ్బా పటేల్ వంటి కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే… చివరాఖరికి ఆ అవకాశం షాలినికి దక్కిందని సమాచారం. త్వరలోనే షాలిని ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా… ఈ చిత్రానికి మిక్కీ జే.మేయర్ సంగీతమందిస్తుండగా… సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=DDQfiI_oi1Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: