సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లి సినిమా ‘మహర్షి’ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది.. మహేష్ అభిమానుల్లో ఉత్సుకత కూడా ఎక్కువవుతుంది. గత కొద్ది కాలం నుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగిస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో సాయంత్రం 6గంటలకు గ్రాండ్ గా జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరొస్తారబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఆ ఉత్కంఠకు బ్రేక్ వేశారు. ఈ కార్యక్రమానికి ఒక్కరు కాదు ఇద్దరు హీరోలు ముఖ్య అతిథులుగా రానున్నారు. అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ తో పాటు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయదేవరకొండ కూడా ముఖ్య అతిథిగా రానున్నాడు. మరి మహేష్ సినిమాకు విజయ్ ను గెస్ట్ గా పిలవడం అంటే గ్రేట్ థింగే. ఇకపోతే వెంకీ రీసెంట్ గా మజిలీ ,జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాగా ఈ రెండు సినిమాలు హిట్టయ్యాయి. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వస్తున్నాడు. మరి మహర్షి కి కూడా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూద్దాం..
కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న గ్రాండ్ గా విడుదలకానుంది.
[subscribe]
[youtube_video videoid=YLqUCNxg8HM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: