ప్రస్తుతం కార్తీక్ రాజు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘కౌశల్య క్రిష్ణమూర్తి.. క్రికెటర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ విభిన్నమైన కథను క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా కార్తీక్ రాజు హీరోగా తాజాగా మరో సినిమా ఈరోజు ప్రారంభమైంది. ఆదిత్య మూవీ మేకర్స్ పై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్వరాజ్ నూనె దర్శకత్వం వహించనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. డైరెక్టర్ భీమినేని శ్రీనివాస రావు మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మే 2వ తేదీ నుండి ఈసినిమా రెగ్యులర్ గా షూటింగ్ ను జరుపుకోనుంది. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=Mf7F9Y7Pl88]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: