సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే… ‘బాషా’ తరువాత రజినీ నటించిన చిత్రాలకు తెలుగునాట మరింత క్రేజ్ పెరిగింది. అయితే… ఆ క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళిన చిత్రం మాత్రం ‘నరసింహ’ (తమిళంలో ‘పడయప్ప’). “నా దారి రహదారి” అంటూ రజినీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘ముత్తు’ తర్వాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. శివాజీ గణేషన్, సౌందర్య, రాధారవి, మణివన్నన్, నాజర్, సితార, అబ్బాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డబుల్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ స్వరాలను సమకూర్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నరసింహ’ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర. అగ్ర కథానాయకుల సినిమాల్లో హీరోలతో పాటు సమానంగా సాగే ఓ క్యారెక్టర్ ను డిజైన్ చేయడం అంత సులువైన పనేమీ కాదు. ఇక రజినీ లాంటి సూపర్ స్టార్ సినిమాల్లో అయితే అది మరింత కష్టం. అయితే… అటువంటి రేర్ ఫీట్ లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని… తన అసాధారణ అభినయంతో నీలాంబరి పాత్రలో రమ్య తన నట విశ్వరూపాన్నే చూపించింది. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉండడం మంచిదే అయినా… అది హద్దులు మీరితే, ఓటమిని సైతం అంగీకరించలేకపోతే… అటువంటి నెగటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో రమ్య నటన అద్వితీయం. రజినీతో పోటీ పడి నటించిన రమ్యకృష్ణ ‘నరసింహ’తో నటిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. రమ్యకృష్ణకు ఉత్తమ నటిగా ఫస్ట్ ఫిలిం ఫేర్ ను అందించిన ‘నరసింహ’… ఏప్రిల్ 10, 1999న విడుదలై… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
[youtube_video videoid=cmMg1MoypTI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: