నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కబోతున్నట్టు గత కొద్దిరోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ వేద. తమిళంలో తెరకెక్కిన ఈసినిమా 2017 లో విడుదలైన సంచలన విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. ఈ రీమేక్ లో నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే… ఒరిజనల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన పుష్కర్ – గాయత్రి తెలుగు రీమేక్ని కూడా రూపొందించనున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు విక్రమ్ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్. బాలయ్య, రాజశేఖర్ విక్రమ్ వేదా రీమేక్లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పుకార్లని కొట్టిపారేశారు. అంతేకాదు ఇప్పటి వరకు విక్రమ్ వేదా రీమేక్ రైట్స్ను ఎవరికీ ఇవ్వలేదని వై నాట్ స్టూడియోస్ వారు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రీమేక్ పై తాము ప్రకటించేత వరకూ వెయిట్ చేయాల్సిందిగా కోరారు.
[youtube_video videoid=XvIk8MHMzOk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: