ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహర్షి పూర్తయిన వెంటనే మహేష్ బాబు తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. దిల్ రాజు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ముగ్గురు సూపర్ స్టార్ల రేర్ కాంబినేషన్ కు వేదిక కానున్నదన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. “లేడీ సూపర్ స్టార్- రాములమ్మ” విజయశాంతి, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం కేన్సిల్ అవటంతో ఈ చిత్రం ఇమిడియట్ గా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సరసన హీరోయిన్ గా రష్మిక మందన కూడా ఎంపికైనట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. 2020 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలన్నా ప్లాన్ లో కూడా ఉన్నారట. అయితే వీటన్నింటిపైఓ క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏది ఏమైనా ఈతరం సూపర్ స్టార్ మహేష్ తో మరో ఇద్దరు నిన్నటి తరం సూపర్ స్టార్స్ జాయిన్ అవుతున్నారన్న వార్త ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా మహేష్ బాబు బాల నటుడిగా కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాల నటుడిగా మహేష్ బాబు డ్యూయల్ రోల్ పోషించిన” కొడుకు దిద్దిన కాపురం” లో ఆయన తల్లిగా నటించిన శాంతి 30 ఏళ్ల తరువాత ఇప్పుడు ఏ పాత్రలో కనిపిస్తుందో గానీ మొత్తం మీద ఈ కాంబినేషన్ వార్త అభిమానుల్లో సంచలనం సృష్టిస్తుంది. విజయశాంతి” ఒసేయ్ రాములమ్మ” తరువాత కొన్ని చిత్రాలు చేసినప్పటికీ ఆ చిత్రంలో పోషించిన రాములమ్మ పాత్రే చిరస్మరణీయంగా నిలిచిపోవడం దాని ప్రభావంతో రాజకీయ రంగప్రవేశం చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నికైన విజయశాంతి దాదాపు 15 సంవత్సరాల తరువాత కెమెరా ముందుకు వస్తుందనడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. చూద్దాం మరి ఇది కేవలం రూమర్లకే పరిమితం అవుతుందో? లేక నిజమవుతుందో?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: