`జయ జానకి నాయక` చిత్రంలో జంటగా నటించి అలరించారు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. మళ్ళీ ఒకటిన్నర సంవత్సరం తరువాత ఈ ఇద్దరూ మరో సినిమాలో కలసి నటించబోతున్నారని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… తమిళంలో ఘనవిజయం సాధించిన `రాచ్చసన్` సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయకుడిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనుండగా… కథానాయిక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. త్వరలోనే రకుల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఈ నెలాఖరులో గానీ మార్చి ప్రథమార్ధంలోగానీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వేసవి చివరలో ఈ సినిమా తెరపైకి వచ్చే అవకాశముందని టాక్. మరోసారి… సాయిశ్రీనివాస్, రకుల్ జంట ప్రేక్షకులను మురిపిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=Q15LnRQ__Fg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: