పవన్ చేసిన రిక్వెస్ట్ కు స్పందించి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కాదు హీరో అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అసలు సంగతేంటంటే…గతేడాది ఉత్తరాంధ్రను గజగజ వణికించింది తిత్లీ తుఫాన్. ఈ తిత్లీ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా అల్లకల్లోలంగా మారింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఎంతో జరిగింది. ఇక దాని తరువాత ఆ ప్రాంతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శించి.. అక్కడ పరిస్థితులను పరిశీలించి… శ్రీకాకుళానికి సహాయం చేయడానికి పలువురు ముందుకు రావాలని కోరారు. ఎవరికి తోచిన సహాయం వారు అందించాలన్నారు. అంతేకాదు.. టాలీవుడ్ హీరోలంతా ముందుకు రావాలని.. వారికి సహాయం చేయాలని అవసరమైతే తుఫాన్ భాదిత ప్రాంతాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని.. పిలుపునిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పవన్ కోరిక మేరకు అల్లు అర్జున్ ముందుకొచ్చి తన వంతు తాను సాయం అందించాడు. అమలపాడు గ్రామంలో ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించనున్నాడు. ఈ ప్లాంట్ రేపు ఫిబ్రవరి 14న అల్లు అర్జున్ అభిమానులు, జనసేన కార్యకర్తల సమక్షంలో ప్రారంభం కాబోతోంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందించనున్నారు. దీంతో అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అయ్యారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ పిలుపు నేపథ్యంలో శ్రీకాకుళంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ముందు కొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఆ వివరాలు కూడా తెలియజేస్తానన్నారు. మరి చూద్దాం ఎప్పుడు ఆ టైమ్ వస్తుందో.
[youtube_video videoid=A0zDh5Sgb-0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: