గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) ఈరోజు తన స్వగృహంలో కన్ను మూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ…విజయ బాపినీడు గారు పేరుకు తగ్గట్టే ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. చిరంజీవి గారంటే ఆయనకు, ఆయనంటే చిరంజీవి గారికి ఎంతో ఇష్టం. వారిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని మా కెరీర్ ప్రారంభంలో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ బాపినీడు గారి చివరి చిత్రం ‘కొడుకులు’లో నేను, సాయికుమార్ హీరోలుగా నటించాం. ఆయన ఇవాళ లేకపోవడం అనేది బాధను కలిగించేదే అయినా… ఆయన దర్శకత్వంలో పనిచేశాననే తృప్తి ఉంది. పదేళ్ళ క్రితం ఆయన నా గురించి అడిగారట… హైదరాబాద్ లో ఉంటున్నాడా… చెన్నైలో ఉంటున్నాడా అని… ఆ తర్వాత నేను వెళ్ళి కలుద్దామని అనుకున్నా… అల్జీమర్ తో ఆయన ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
[youtube_video videoid=PdY3bdPFXf0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: